పెసరట్ల కూర
కావలసిన పదార్ధాలు:
పెసరపప్పు 250 gm
తరిగిన ఉల్లిపాయలు 8
పచ్చిమిరప కాయలు 8
అల్లం 1/2 అంగుళం
జీలకర్ర 3 స్పూన్లు
ధన్యాలు 3 స్పూన్లు
దాల్చినచెక్క 1/2 అంగుళం
లవంగాలు 6
ఏలకలు (వొలిచినవి) ౩
వెల్లుల్లి రెబ్బలు 2
ఎఱ్ఱకారం 1 స్పూన్
ఉప్పు తగినంత
నూనె 4 స్పూన్లు
చింతపండు (నిమ్మకాయంత) రసం
తయారీ విధానం:
ముందుగ పెసరట్లు పోసుకోవాలి. దానికి పెసర పప్పు రెండు గంటలు నీటిలో నానబెట్టి పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బు కోవాలి. ఈ పిండి తో పెసరట్లు బాగా దళసరిగా పోసి పక్కన పెట్టుకోవాలి.
చల్లారిన తరువాత వాటిని స్క్వేర్ గా కాని డైమెండ్ షేపులో కాని కట్ చేసి పెట్టుకోవాలి.
మసాల కోసం తరిగిన ఉల్లిపాయలు, ధన్యాలు, జీలకర్ర, అల్లం,లవంగాలు, ఏలకలు, దాల్చినచెక్క మెత్తగా రుబ్బుకోవాలి.
నాన్ స్టిక్ పాన్ లో నూనె వేడిచేసి దాంట్లో పైన చెప్పిన ఉల్లిమసాల వేసి బాగా ఎర్రగా వేయించాలి.
అందులో చింతపండు రసం వేసి ఉడకనివ్వాలి. అప్పుడు ఎఱ్ఱ కారం వేసి మరి కొంతసేపు వేగనిచ్చి దాంట్లో కట్ చేసిన పెసరట్టు ముక్కలని వేసి మూతపెట్టి సుమారు 5min ఉడకనివ్వాలి.
ఏంతో రుచికరమైన పెసరట్లకూర రెడీ!
0 comments:
Post a Comment